సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. మొత్తం 19 మంది నిందితులకు సమన్లు పంపింది. 2024 డిసెంబర్ 4న పుష్ప2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి చనిపోగా, ఆమె కొడుకు శ్రీతేజ్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ కేసులో అల్లు అర్జున్ A11గా ఉన్నారు.